Wednesday 20 January 2016

శ్రీమదాది త్యాగరాజ గురువరం నమామ్యహం



మహా వాగ్గేయకారుడు శ్రీ త్యాగరాజును స్తుతిస్తూ  రచించిన  కీర్తన. ఈ కీర్తన మైసూర్ వాసుదేవాచారి రచించినదని అనుకుంటున్నాను.  మా గురువుగారు వీణమీద చెప్పారు.
రాగం : కల్యాణి,  తాళం: రూపకం.
పల్లవి.   శ్రీమదాది త్యాగరాజ గురువరం. . నమామ్యహం.

అ.ప.    భూమిజా.. రమణ చరణ
          కమల భజన దురం ధరం...         !!శ్రీ!!
చ.       సకలలోక సంసేవిత  సంగీత సాహిత్య
          సారభరిత సులలితపద  సమ్మెళన సంశోభిత
మ.కా.సాహిత్యం:
          సంకీర్తన సురజన సముపార్జిత సత్కీర్తిం
          సురమునివర కారుణ్య సంజాత సుజ్ఞానం
          సామగానలోల వాసుదేవ హృదయ సుస్థితం
          సుజన హృదయ జలధి చంద్ర మమల వంశ సంజాతం
చి.స్వరం:
          సరినిరిని పదనిదమ| పగమరి గమనిదదా..|
          మగరినిదా రిగమనిదా| నిదమగమద గరినిదనిరి|
          దగరినిరీ| దరినిమదా| మగరి మగరి నిరి దగారి|
          సనిదరీ, సనిద పదనిస |రిమపద నిసరిగమపదని ||శ్రీ||

No comments:

Post a Comment