Friday 22 May 2015

కలియుగ లక్షణాలు




హనుమ భీమునికి చెప్పిన కలియుగ లక్షణాలు:
భీముడు ద్రౌపది కోరికమేరకు సౌగంధిక పుష్పాల కోసం హిమవత్పర్వాతాలకి వెళ్ళినప్పుడు ఆంజనేయ సాక్షాత్కారం కలుగుతుంది. అప్పుడు స్వామి భీమునికి కలియుగ లక్షణాలు చెపుతాడు.
కలిలో కాలానుగుణంగా వర్షాలు పడవు. చల్లిన విత్తనాలు పొల్లులవుతాయి. ఎప్పుడూ ప్రజలను కరువు పీడిస్తుంది.పొట్ట గడవక ప్రజలు జన్మభూమిని విడిచి వలసలు పోతారు. పృధివి నిస్సారమవుతుంది. తినే పదార్ధాలలో సారం ఉండదు. ఆ కారణంగా ప్రజలు దుర్బలులు, రోగగ్రస్తులు, మరుగుజ్జులు అవుతారు. అల్పాయుష్కులవుతారు.
వివాహవ్యవస్త, దాంపత్య ధర్మం భ్రస్టు పడతాయి. భార్యలకి తమభర్తయందు సంపాదనననుసరించియే గౌరవం కాని వేరే గౌరవం ఉండదు.అందరిలోనూ స్వేచ్చాప్రవ్రుత్తి ఎక్కువవుతుంది. భార్యాభర్తలు ఇష్టసంచారం చేస్తారు. భార్యాభర్తలు, గురు శిష్యులు పరస్పర వంచకులవుతారు. అత్తమామలను కోడళ్ళు నిర్లక్ష్యం చేస్తారు. తల్లితండ్రులను పిల్లలు గౌరవించరు.  
క్రయవిక్రయాలలో అంటా కపటమే. దాచుకొన్న సొమ్ము దోచుకుంటారు. పరస్త్రీ, పరధనాలను పటికబెల్లం ముక్కల్లా తినేస్తారు. పున్యపాపాలు, పూర్వజన్మ, పునర్జన్మలు, స్వర్గనరకాదులు లేవంటారు. ఎవరి దగ్గర శాస్త్ర పాండిత్యము ఉండదు. వాగాడంబరము మాత్రం ఉంటుంది. వేదనింద అధికమౌతుంది. శరీరం మీద శ్రద్దే కాని ఆత్మవిచారణ చెయ్యరు.
భగవంతుడు లేదంటారు.ధనవంతున్ని కొలుస్తారు. ఇచ్చేపాలని బట్టి గోవు మీద గౌరవం అంతేకాని గోవుయందు పవిత్రభావం ఉండదు.బ్బ్రాహ్మణునియందు  గౌరవభావముండదు. హింసాప్రవ్రుత్తి అధికమౌతుంది. స్వార్ధంతో స్వధర్మాని విడిచి భయావహమైన పరధర్మాన్ని ఆశ్రయిస్తారు.
ముఖ్యంగా స్త్రీలు దుష్టులౌతారు. వ్యభిచారిణులౌతారు మనసుకునచ్చినవాడే మగడంటారు. వివాహ విషయంలో కులగోత్రాలు పట్టించుకోరు. వర్ణవ్యవస్థ నడవదు. ధనవంతుడే రాజు. ధనంతో కొనలేనిది ఏదీ ఉండదు. నటులు ప్రభువులౌతారు. దొంగలే రక్షకులౌతారు. పాలకులు ప్రజల బాగోగులు పట్టించుకోరు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఉండదు. అనాధలౌతారు.
దేవాలయ భూములను ఆక్రమించుకుంటారు. దైవదర్సానానికి ధనం గుంజుతారు. భక్తీ సంపాదనకు మార్గమౌతుంది. నిషిద్ధ పదార్ధాలను సేవిస్తారు. అందరూ మాంసాహారులౌతారు. బ్రాహ్మణులు అనాచారవంతులై కుక్కలను పెంచుతారు. దొంగలు, నాస్తికులు, పాషండులు ప్రభువులౌతారు. ప్రజలను రక్షించాల్సిన పాలకులే భక్షకులై ప్రజలను దోచుకుంటారు.
ఇంకా ఎన్నో హనుమ చెప్పాడు. మహాభారత కాలంలోనే ఇప్పటి పరిస్థితులు ఊహించి రాసారంటే ఆశ్చర్యంగా ఉంది. ఇందులో వన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఉన్నాయి.
అప్పుడు భీముడు వికలమనస్కుడై అన్నా! ఆంజనేయా! వింటుంటేనే భయోత్పాతాన్ని కలిగించే ఈ కలిప్రభావ్వాన్నుండి తప్పించుకొనే ఉపయమేమీ లేదా? అని అడిగాడు. సమాధానంగా హనుమ ధృడ గాత్రంతో “సోదరా! భవిష్యద్బ్రహ్మ ఐన నన్ను ఎవరు భక్తితో ఆరాధిస్తారో, కనీసం నా నామాన్నైనా సరే జపిస్తారో వారిని ఈ కలిదోషాలేమీ అంటవు. నా భక్తులంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారి ‘ఆంజనేయా!’ అని ఆర్తితో పిలిస్తే చాలు వారి చెంత వాలుతాను. ఆపన్నులను రక్షించడం కంటే నాకు వేరే కర్తవ్యమ్ లేదు అని చెప్పాడుట.  జయహో ఆంజనేయా!..
పొన్నాడ లక్ష్మి
 సేకరణ : అనుసృజన “సాహిత్య కళానిధి” విశ్వనాధం సత్యనారాయణ మూర్తి. సంపూర్ణ హనుమత్ చరిత్రము వచన కావ్యం నుండి.