ఈ వారం అన్నమయ్య కీర్తన.
సర్వాంతరాత్ముడవు శరణాగతుడ నేను
సర్వాపరాధినైతి చాలు చాలునయ్యా!
ఊరుకున్న జీవునికి ఒక్కఒక్క స్వతంత్రమిచ్చి
కోరేటి అపరాధాలు కొన్నివేసి
నేరకుంటే నరకము నేరిచితే స్వర్గమంటా
దూరువేసే వింతగా దోషమెవ్వరిదయ్యా?
మనసు చూడవలసి మాయలు నీవే కప్పి
జనులకు విషయాలు చవులు చూపి
కనుగొంటే మోక్షమిచ్చి కానకుంటే కర్మమిచ్చి
ఘనముసేసే విందు కర్తలెవరయ్యా?
వున్నారు ప్రాణులెల్లా నొక్క నీ గర్భములోనే
కన్న కన్న భ్రమతలే కల్పించి
ఇన్నిటా శ్రీ వేంకటేశ ఏలితివి మిమ్మునిట్టె
నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసు నయ్య!
భావం.. స్వామీ! ఓ వెంకటేశా! నీవు సర్వాత్మకుడవు. నేను నీ శరణు కోరేవాడినై సర్వపరాధాలకు కారణభూతుడైతిని. చాలు చాలయ్యా!
ఊరకే ఉన్న జీవునికి ఎంతో స్వతంత్రమిచ్చి కొన్ని విషయాలు సృష్టించి, అవి చెయ్యకుంటే నరకము, చేస్తే స్వర్గము అని చెప్పి మళ్ళీ మమ్మల్ని వింతగా నిందిస్తున్నావు. ఇందులో దోషమెవరిదయ్యా?
మనసుతో చూడవలసిన వచ్చినవాటికి మాయలను నీవే కప్పిపుచ్చి, మాకందరికీ ఎన్నో విషయాలు రుచి చూపించి, ఇందులో మంచిచెడ్డలు కనుగొంటే మోక్షమిచ్చి, కానుకోక వాటికి లోబడితే కర్మమునిచ్చి గొప్పగా చేసేనని చెప్తావు. ఇందుకు కర్త ఎవరయ్యా?
ప్రాణులందరూ నీ గర్భములోనే ఉన్నారు, మేమే కన్నామని మాకు భ్రమ కల్పించుతావు. జగత్తునంతా నీవే ఏలుతున్నావు. అంతా నీ చేతిలోనే ఉంది. ఇంక నన్ను నీవు, నిన్ను నేను ఎంచుకుంటే ఎలా? నీకే తెలుసు గదయ్యా..
Saturday, 25 November 2017
Friday, 17 November 2017
ఈ వారం అన్నమయ్య (పెదతిరుమలాచార్య, అన్నమయ్య కుమారుడు) కీర్తన :
ఈ వారం అన్నమయ్య (పెదతిరుమలాచార్య, అన్నమయ్య కుమారుడు) కీర్తన :
అదే వంటశాలలోన అలిమేలుమంగనాంచా
రెదుట శ్రీవేంకటేశు కితవైనట్లు ॥
రెదుట శ్రీవేంకటేశు కితవైనట్లు ॥
వెండిపైడి చట్లలో వేరె కూరలెల్ల
వండించి దొంతివెట్టించి వద్దనుండి
కొండలపొడవుగాగ కోటిబోనా అపరంజి
కుండల గుమ్మరింపించి కొలువై కూచుండీ ॥
వండించి దొంతివెట్టించి వద్దనుండి
కొండలపొడవుగాగ కోటిబోనా అపరంజి
కుండల గుమ్మరింపించి కొలువై కూచుండీ ॥
పానకాలు శిఖరులు పటికింపు గొప్పెరల
పూని వాసనలుగాగ పువ్వు గట్టించి
వానినే నీలపుఅత్తువములనే నించి నించి
ఆనించుకొని వడ్డించ నాయత్తపడీని ॥
పూని వాసనలుగాగ పువ్వు గట్టించి
వానినే నీలపుఅత్తువములనే నించి నించి
ఆనించుకొని వడ్డించ నాయత్తపడీని ॥
అందెలు గల్లు రనగా నడుగులు పెట్టిపెట్టి
విందు అలమేలుమంగ వేళ వేళను
చెంది శ్రీవేంకటపతికి చేతులకు గడిగడి
అందియిచ్చి సొత్తున దా నారగించి నదివో ॥
విందు అలమేలుమంగ వేళ వేళను
చెంది శ్రీవేంకటపతికి చేతులకు గడిగడి
అందియిచ్చి సొత్తున దా నారగించి నదివో ॥
పెదతిరుమలయ్య వినిపిస్తున్న ఈ చక్కని సంకీర్తనలో దేవి అలిమేలుమంగ వంటశాలలో తయారుచేసిన వేడివేడి వంటకాలలోంచి తిరుమలేశునికిష్టమయిన కూరలు, రుచికరమయిన పదార్ధాలు, పానకాలు స్వామి చేతికందిస్తూ కలిసి భుజించిందట. చదివి మీరు ఆనందించండి.
దేవి అలిమేలుమంగ నాంచారి అదే వంటశాలలో పతి శ్రీవేంకటేశ్వరుని ఎదుట కూర్చుని ఆయనకు హితవైనట్లు వడ్డించిందట. బంగారు వెండి గిన్నెలలో రకరకాల కూరలు తెచ్చి దొంతరగా పెట్టించి ఒకదానివెనుక ఒకటి వడ్డించింది. రకరకములైన చిత్రాన్నములను స్వామి ఏడుకొండలు పొడుగ్గా వరుసగా ఉన్నట్లు వడ్డించింది. బంగారు కుండలలో కుమ్మరించి కొలువై కూర్చుని వడ్డించింది. పెద్దపెద్ద పాత్రలలో పటికబెల్లపు శిఖరాలుగా పోసి మంచినీటితో కలిపి చక్కని పానకాలు చేసారు. సువాసనకోసం కొంత కుంకుమపువ్వు కలిపి నీలములతో చేసిన గరిటలతో నించి స్వామికి ఆనుకును కూర్చుని వడ్డించిందట. దేవి కాలి అందియలు ఘల్లుఘల్లుమని ధ్వనిస్తుంటే నాజూకుగా చిన్నచిన్న అడుగులు పెట్టుకుంటూ అలిమేలుమంగమ్మ సరైనవేళకు శ్రీ వేంకటేశునకు వడ్డించింది. స్వయంగా ఆయన చేతులకు అందించింది. ఆయన పొత్తుననే తానూ కూర్చుని అదిగో దేవి కూడా ఆరగించింది.
భర్తకి ఇష్తమైన పదార్ధాలను వండి ఆప్యాయంగా పక్కన కూర్చొని ఒక్కొక్కటీ వడ్డించి సంతృప్తిపరచడం మన భారత స్త్రీ సంప్రదాయం. అదే విషయాన్ని పెదతిరుమలయ్య ఈ కీర్తనలో ఎంతో అందంగా వివరించాడు.
- పొన్నాడ లక్ష్మి (వ్యాఖ్యానం : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు)
దేవి అలిమేలుమంగ నాంచారి అదే వంటశాలలో పతి శ్రీవేంకటేశ్వరుని ఎదుట కూర్చుని ఆయనకు హితవైనట్లు వడ్డించిందట. బంగారు వెండి గిన్నెలలో రకరకాల కూరలు తెచ్చి దొంతరగా పెట్టించి ఒకదానివెనుక ఒకటి వడ్డించింది. రకరకములైన చిత్రాన్నములను స్వామి ఏడుకొండలు పొడుగ్గా వరుసగా ఉన్నట్లు వడ్డించింది. బంగారు కుండలలో కుమ్మరించి కొలువై కూర్చుని వడ్డించింది. పెద్దపెద్ద పాత్రలలో పటికబెల్లపు శిఖరాలుగా పోసి మంచినీటితో కలిపి చక్కని పానకాలు చేసారు. సువాసనకోసం కొంత కుంకుమపువ్వు కలిపి నీలములతో చేసిన గరిటలతో నించి స్వామికి ఆనుకును కూర్చుని వడ్డించిందట. దేవి కాలి అందియలు ఘల్లుఘల్లుమని ధ్వనిస్తుంటే నాజూకుగా చిన్నచిన్న అడుగులు పెట్టుకుంటూ అలిమేలుమంగమ్మ సరైనవేళకు శ్రీ వేంకటేశునకు వడ్డించింది. స్వయంగా ఆయన చేతులకు అందించింది. ఆయన పొత్తుననే తానూ కూర్చుని అదిగో దేవి కూడా ఆరగించింది.
భర్తకి ఇష్తమైన పదార్ధాలను వండి ఆప్యాయంగా పక్కన కూర్చొని ఒక్కొక్కటీ వడ్డించి సంతృప్తిపరచడం మన భారత స్త్రీ సంప్రదాయం. అదే విషయాన్ని పెదతిరుమలయ్య ఈ కీర్తనలో ఎంతో అందంగా వివరించాడు.
- పొన్నాడ లక్ష్మి (వ్యాఖ్యానం : శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు)
Sunday, 12 November 2017
Saturday, 11 November 2017
అందరికొక్కటే చాలు ఆండ్లకు మొగలకు ముందటెత్తు వేరే నీతో మోవనాడవలెనా - అన్నమయ్య కీర్తన
ఈ వారం అన్నమయ్య కీర్తన :
అందరికొక్కటే చాలు ఆండ్లకు మొగలకు
ముందటెత్తు వేరే నీతో మోవనాడవలెనా ॥
వలపుల ఈది ఈది వాసులకే లోగి లోగి
అలుకలే తవ్వి తవ్వి యట్టె నవ్వి
చెలగేటి విరహివి చింత మాన్ప నెరగనా
చెలి నింతే నీకు నేను చెప్పి చూపవలెనా ॥
బలిమై చేయి చాచి చాచి పంతాన మెయి దోచిదోచి
పలుకాక గందికంది భామల బొంది
కులుకుజాణడవు నా కోర్కె తీర్పనెరుగవా
ఇలా నే జవ్వని నింతే ఇంతరట్టు వలెనా ॥
పలుకులే చల్లిచల్లి పారిపారి మళ్ళీ మళ్ళీ
వలరాచపనులకే వయ్యాళి వెళ్ళి
తలచి శ్రీవేంకటేశ తగ నన్ను గూడితివీ
వెలయు నీదేవి నింతే వేదుకొనవలెనా ॥
భావం :
అన్నమయ్య చెప్పిన ఈ కీర్తనలో, ఆడువారైనా, మగవారైనా అందరికీ ఒక్కటే మాట చాలును అంటారు. ముందటనే ఎత్తుగడగా నిన్ను నొప్పించేటట్లు నాకు మాటాడవలఇన పనియేమి.
ఆడువారికైనా మగవారికైనా ఒక్కటే నీతి కదా స్వామీ ! నీవు వనితల వలపులలో ఈది ఈది, వారి చూపే వాసులకు (ఆధిక్యమునకు) లొంగి లొంగి వారి అలకలు తీర్చి తీర్చి మళ్ళీ మధురంగా వాళ్ల విరహతాపమును నీవే అనుభవిస్తూ వారి చింత బాపుట ఎరుగుదవు. నీకు నేను నెచ్చిలినే కదా స్వామీ ! వేరే నీకు చెప్పవలనా ?
స్వామీ ! బలిష్టమయిన నీ చేయి చాచి చాచి, నా శరీరమును పంతముతో దోచి దోచి, అనేకమైన తాపములతో కంది కంది, అనేకమంది భామలను పొంది పొంది, వారితో కులికే నేర్పరివి. మరి నా కోర్కెలనుకూడా తీర్చనెరుగవా? నేనూ జవ్వనినే. నన్నింత రట్టుచేయవలెనా ?
స్వామీ ! నాపై మాటలు గుప్పించి గుప్పించి, మళ్ళీ మళ్ళీ నన్ను పారి పారి (తడివీ తడివీ) మన్మధుని పనులకు వాహ్యాళికి వెళ్ళి పనిలోపనిగా వేంకటేశా నన్ను కూడితివి. ఇంతాచేసి నేను నీ దేవేరినే కదా స్వామీ. నన్నింత వేడుకోవలెనా?
అందరికొక్కటే చాలు ఆండ్లకు మొగలకు
ముందటెత్తు వేరే నీతో మోవనాడవలెనా ॥
వలపుల ఈది ఈది వాసులకే లోగి లోగి
అలుకలే తవ్వి తవ్వి యట్టె నవ్వి
చెలగేటి విరహివి చింత మాన్ప నెరగనా
చెలి నింతే నీకు నేను చెప్పి చూపవలెనా ॥
బలిమై చేయి చాచి చాచి పంతాన మెయి దోచిదోచి
పలుకాక గందికంది భామల బొంది
కులుకుజాణడవు నా కోర్కె తీర్పనెరుగవా
ఇలా నే జవ్వని నింతే ఇంతరట్టు వలెనా ॥
పలుకులే చల్లిచల్లి పారిపారి మళ్ళీ మళ్ళీ
వలరాచపనులకే వయ్యాళి వెళ్ళి
తలచి శ్రీవేంకటేశ తగ నన్ను గూడితివీ
వెలయు నీదేవి నింతే వేదుకొనవలెనా ॥
భావం :
అన్నమయ్య చెప్పిన ఈ కీర్తనలో, ఆడువారైనా, మగవారైనా అందరికీ ఒక్కటే మాట చాలును అంటారు. ముందటనే ఎత్తుగడగా నిన్ను నొప్పించేటట్లు నాకు మాటాడవలఇన పనియేమి.
ఆడువారికైనా మగవారికైనా ఒక్కటే నీతి కదా స్వామీ ! నీవు వనితల వలపులలో ఈది ఈది, వారి చూపే వాసులకు (ఆధిక్యమునకు) లొంగి లొంగి వారి అలకలు తీర్చి తీర్చి మళ్ళీ మధురంగా వాళ్ల విరహతాపమును నీవే అనుభవిస్తూ వారి చింత బాపుట ఎరుగుదవు. నీకు నేను నెచ్చిలినే కదా స్వామీ ! వేరే నీకు చెప్పవలనా ?
స్వామీ ! బలిష్టమయిన నీ చేయి చాచి చాచి, నా శరీరమును పంతముతో దోచి దోచి, అనేకమైన తాపములతో కంది కంది, అనేకమంది భామలను పొంది పొంది, వారితో కులికే నేర్పరివి. మరి నా కోర్కెలనుకూడా తీర్చనెరుగవా? నేనూ జవ్వనినే. నన్నింత రట్టుచేయవలెనా ?
స్వామీ ! నాపై మాటలు గుప్పించి గుప్పించి, మళ్ళీ మళ్ళీ నన్ను పారి పారి (తడివీ తడివీ) మన్మధుని పనులకు వాహ్యాళికి వెళ్ళి పనిలోపనిగా వేంకటేశా నన్ను కూడితివి. ఇంతాచేసి నేను నీ దేవేరినే కదా స్వామీ. నన్నింత వేడుకోవలెనా?
Saturday, 4 November 2017
నిన్ను బోలు వారమా నీఅంతవారమా - అన్నమయ్య కీర్తన
ఈ వారం అనమయ్య కీర్తన..
ఈ కీర్తనలో గోపికల అమాయక మనస్తత్వం అన్నమయ్య ఎంతబాగా వివరించాడో చూడండి.
అంతదొడ్డవారమా అందుకు దగుదుమా
మంతనపుమాటల మరగించేవు ॥
నిన్ను బోలు వారమా నీఅంతవారమా
వెన్నలు జల్లలు నమ్మువెలదులము
పనినఈరత్నాల బంగారుతిండ్లలో
యెన్నకైనతూగుమంచ మెక్కు మనేవు ॥
చెప్పరానివారమా చెమటపై వారమా
కప్పురంపుజని యేరుగనివారమా
చిప్పిలేటితేనెల సేమంతివిరుల
చప్పరములోనికి సారే బిలిచేవు. ॥
జంకెనలవారమా సరసపువారమా
మంకుమంకు మాటల మందవారమా
వెంకటాద్రి విభుడా వేడుకలరాయడా
తెంకికి నెప్పరిగమీదికి రమ్మనేవు. ॥
భావం:
అన్నమయ్య ఈ మధురకీర్తనలో ఒక గోపికవలె భావించుకుని కృష్నయ్యతో నిష్టూరంగా ఏమంటున్నాడో ఆకర్ణించండి. కృష్ట్నయ్యా ! నీ వలపుజల్లులలో తడిసేతంట అదృష్టం మాకు ఉన్నదా? మేము అంత గొప్పవారమా? నీతో మంతనములాడే మాటల చాతుర్యము మాకు గలదా? మేము అందుకు తగినవారమా? మమ్మల్ని మాటలతో మైమరపించుట నీకు తగునా? కృష్ట్నా ! మేము నిన్ను పోలినవారమా? నీ అంతటివారమా? మేము వెన్నలు చల్లలు, అమ్ముకునే వనితలము. రత్నాలు తాపడంచేసిన బంగారపు ఇండ్లలో ఊయల చమునెక్కమని అనేవు. మాకంత అదృష్టం దక్కుతుందా? మాతో నీకు సంబంధం ఉన్నదని చెప్పగలవారమా? చెమటపోవునట్లు పన్నీటి స్నానాలు చేయగలవారమా? కర్పూరం తింటూ రుచినాస్వాదించలేని గొల్లవారము. తేనెల మాధుర్యము తెలియనివారము. చేమంతిపూలు విస్తరించిన పందిట్లోకి రమ్మని మాటిమాటికీ మమ్మల్ని పిలుస్తావు. ఇది బాగున్నదా? కృష్ట్నా మేము నిన్ను బెదిరించగలవారమా? పోనీ సరసములాడగల చతురలమా? పైగా పుష్కలంగా మంకుతనమున్న గొల్లవారము. ఓ వేంకటాద్రినాధుడా! వేడుకలరాయుడా! మమ్మల్ని మిద్దె మీదకు రమ్మనేవు. అది నీ స్థానమని మేమెరుగమా? ఇది నీకు న్యాయమా? (వ్యాఖ్యానం : అమరవాది సుబ్రహమణ్య దీక్షితులు, సేకరణ : పొన్నాడ లక్ష్మి).
Friday, 27 October 2017
ఎప్పుడు గాని రాడో యెంతదడవాయ కాలి - చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా - అన్నమయ్య కీర్తన
ఈ వారం అన్నమయ్య కీర్తన.
ఎప్పుడు గాని రాడో యెంతదడవాయ కాలి -
చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా
చప్పుడాలకించి మతి జల్లురనెనమ్మా
ఇద్దరమదరిపాటు యేకాంతాన నాడుకొన్న -
సుద్దులు దలచిమేను చురుకనెనమ్మా
పెద్దగా కస్తూరిబొట్టు పెట్టిననాతడు గోర
తిద్దుట దలచి మేను దిగులనెనమ్మా
సుద్దులు దలచిమేను చురుకనెనమ్మా
పెద్దగా కస్తూరిబొట్టు పెట్టిననాతడు గోర
తిద్దుట దలచి మేను దిగులనెనమ్మా
పాయక యాతడూ నేనుఁ బవ్వళించే యింటివంకఁ
బోయి పోయి కడుఁ జిన్నబోతి నోయమ్మా
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన
పాయపుఁ జంద్రుల జూచి భ్రమసితినమ్మా
బోయి పోయి కడుఁ జిన్నబోతి నోయమ్మా
తోయపు గుబ్బల చన్నుదోయి మీద వాడొత్తిన
పాయపుఁ జంద్రుల జూచి భ్రమసితినమ్మా
కూడిన సౌఖ్యములందు కొదలేని వాని నా -
వేడుక మతిఁ దలచి వెరగాయ నమ్మా
యీడులేని తిరువేంకటేశుడిదె నాతోడో
నాడినట్టే నాచిత్తమలరించే నమ్మా
వేడుక మతిఁ దలచి వెరగాయ నమ్మా
యీడులేని తిరువేంకటేశుడిదె నాతోడో
నాడినట్టే నాచిత్తమలరించే నమ్మా
భావం :
అలెమేలుమంగమ్మ తన స్వామికోసం ఎదురుచూస్తూ గడపిన మధురక్షణాలను తలచుకుంటూ వ్యక్తపరచిన భావాలను ఈ కీర్తనలో అన్నమయ్య ఎంత బాగా పొందుపరచాడో చూడండి.
ఇంత తడవయినా స్వామి ఇంకా రాడేలనమ్మా ! పాదాల సవ్వడి వినిపించినట్లు మది ఝల్లుమనెనమ్మా. ఏకాంతాన ఇరువరము గడపిన మధుర క్షణాలను తలచి నా మేను జలదరించెనమ్మా. పెద్ద కస్తూరి తిలకము దిద్దుకున్న అతడు గోరుతో నా మోమున తిలకము దిద్దిన క్షణాలు మదిలో మెదిలెనమ్మా. ఇద్దరమూ శయనించే శయనాగారమునకు ఆతడు ఒక్కడే పోవగా చిన్నబోతినమ్మా..నా గుబ్బలమీద తానొత్తిన గుర్తులను చూచి భ్రమసితినమ్మా. స్వామితో కూడిన సౌఖ్యములను మరీమరీ తలచి నా తనువు పులకరించెనమ్మా. సరిలేని శ్రీ వేంకటేశుడు నాతో ఆడిన సరసాలను తలచి నా చిత్తము అలరించినమ్మా.
- పొన్నాడా లక్ష్మి
Saturday, 14 October 2017
చాలు చాలు నీ హరియే మాకును – సకల క్రియలకు నాయకుడు. - అన్నమయ్య కీర్తన
ప. చాలు చాలు నీ హరియే మాకును – సకల క్రియలకు నాయకుడు.
నాలుక తుదనే యీత డుండగా - నలుగడ నెవ్వరి వెదకేము. ॥
నాలుక తుదనే యీత డుండగా - నలుగడ నెవ్వరి వెదకేము. ॥
౧. ఏలినవాడట లక్ష్మీ విభుడట – యేమిటను కొరత మాకికను
నాలో నున్నాడు బ్రహ్మతండ్రి యట – నా కాయుష్యము బాతా.
పాలజలధిపై దేవుని వారము – పాడి మాకు నిక నే మరుదు?
ఆలింపగ నేమింతటి వారము – అన్యుల కిక జెయి చాచేమా? ॥
నాలో నున్నాడు బ్రహ్మతండ్రి యట – నా కాయుష్యము బాతా.
పాలజలధిపై దేవుని వారము – పాడి మాకు నిక నే మరుదు?
ఆలింపగ నేమింతటి వారము – అన్యుల కిక జెయి చాచేమా? ॥
౨. భూకాంతాపతి కింకరులము యీ - భూములన్నియును మా సొమ్మే
పైకొని చక్రాయుధుడే మా దాపు – భయములన్నిటా బాసితిమి,
ఈకడ నచ్యుతు మరగు చొచ్చితిమి – యెన్నటికిని నాసము లేదు.
ఏ కొరతని యిక నాసపడుచు – నే మెవ్వరికి నోళ్ళు దెరచెదము. ॥
పైకొని చక్రాయుధుడే మా దాపు – భయములన్నిటా బాసితిమి,
ఈకడ నచ్యుతు మరగు చొచ్చితిమి – యెన్నటికిని నాసము లేదు.
ఏ కొరతని యిక నాసపడుచు – నే మెవ్వరికి నోళ్ళు దెరచెదము. ॥
౩. శ్రీ వైకుంఠుని దాసులమట యర – చేతిది మోక్షము మా కిదివో
పావన గంగా జనకుని బంట్లము – పాపము లన్నిట బాసితిమి.
శ్రీ వేంకటపతి వరము లియ్యగా - జిక్కిన వెలుతులు మాకేవి?
యీ వైభవముల దనిసిన మాకును – యితరుల దగిలెడి దికనేది? ॥
పావన గంగా జనకుని బంట్లము – పాపము లన్నిట బాసితిమి.
శ్రీ వేంకటపతి వరము లియ్యగా - జిక్కిన వెలుతులు మాకేవి?
యీ వైభవముల దనిసిన మాకును – యితరుల దగిలెడి దికనేది? ॥
భావమః ఇదే మాకు చాలు. ఇంత కంటె మాకేమియు వలదు. శ్రీ హరియే మాకు అన్నిటా నాయకుదు. ఇతడు మా నాలుక చివరనే ఉన్నాడు. ఇంక మేము నలువంకల వేరొకరి కోసమై వెదకవలసిన అవసరమే లేదు.
ఈతడు సిరిసంపదలకు నిలయమైన శ్రీ మహాలక్ష్మికే మగడు. ఇంక మాకెందైన కొరత కలదా? ఈ చరాచర సృష్తి కర్త అయిన బ్రహ్మను కన్న తండ్రి నాలోనే ఉన్నాదు. ఇక నా కాయువునకు కొదువా? పాలకడలిపై పవళించు దేవుని వారము. ఇక మాకు పాడి కెమి లోటు? పరికించి చూడగా ఆ పరమాత్ముని కృపచె మే మింతటి వారమైతిమి ఇక ఇతరుల చెంత చేయి చాపుదుమా?
మేము భూదేవి భర్త అయిన శ్రీ హరికి దాసులము. ఈ భూములన్నీ మా సొత్తే. చక్రాయుధుడై శ్రీ హరి మా చెంత నుండగా మా భయములన్ని తొలగిపోయినవి. మేము అచ్యుతుని శరణు జొచ్చితిమి. మా కెన్నటికి నాశము లేదు. ఇంక మాకేమి కొరత కలదని ఇతరుల ముందు నోరు తెరిచి యాచించెదము?
మేము శ్రీ వైకుంఠుని దాసులము. మాకు మోక్ష మరచెతనే ఉన్నది. పాపనాశిని అయిన పవిత్ర గంగానదికి తండ్రియైన హరికి సేవకులము మేము. అన్ని పాపముల నుండి విముక్తి పొందితిమి. శ్రీ వేంకతటేశ్వరుడే మాకు వరములిచ్చు దేవత. మాకిక వెలితి యేది? ఇన్ని వైభవములతో త్రుప్తి నొందిన మాకు ఇతరుల వెంతబడి దేబిరించవలసిన ఆవశ్యకత యేమున్నది?
ఆన్నింటా ఆ పరమాత్ముదు అండగా ఉండగా ఇతర చింతలు మనకేలా అని అన్నమయ్య ఈ కీర్తనలొ మనకి వివరించాడు.
Subscribe to:
Posts (Atom)
