Saturday 9 July 2022

గరికపాటి వారి ఉపన్యాసం.

 

శ్రీయుతులు గరికపాటి నరసింహారావుగారి ఆధ్యాత్మిక వ్యాస సంపుటిలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

రామాయణంలో యుధ్ధకాండలో రావణవధ అయిపోయాక విభీషణుడు వచ్చి తన అన్నగారి పార్ధివ దేహాన్ని అప్పగిస్తే రాక్షసుల వంశాచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించుకొంటామని చెప్పి శ్రీరాముని అనుమతి కోరాడు. అప్పుడు మర్యాదాపురుషోత్తముడైన రాముని సమాధానం చూడండి.

"మరణాంతాని వైరాణి, నిర్వుత్తం నః ప్రయోజనం

క్రియతమధ్య సంస్కారః మమాప్యేష యథా తవ"

"ఓ విభీషణా! ఎంతటి శత్రుత్వమైనా చావుతో ముగిసిపోవాలి. సీతాసంరక్షణం కోసం సంధి కుదరక ఈ యుధ్ధం చేయవలసి వచ్చింది కానీ ఈ జననష్టం నా కిష్టం లేదు. మీ అన్నగారి పార్ధివ దేహానికి మీ ఆచారం ప్రకారం దహనసంస్కారాలు నడిపించు. ఇకనుండి ఈ పెద్దమనిషి నీకే కాదు, నాకూ అన్నగారే"

భార్యను ఎత్తుకుపోయినవాడి మీద ఎవరికైనా ఎంత కక్ష ఉంటుంది? అటువంటి కోపతాపాలన్నీ మరిచిపోయి ధర్మబధ్ధంగా, బాధ్యతాయుతంగా మాట్లాడటం ఆ శ్రీరామునికే చెల్లింది. అందుకే ఆయన దేవుడయ్యాడు.

ఈ దేవుడే, ఈ రాముడే ఇన్ని వేల ఏళ్ళుగా ఈ జాతికి స్ఫూర్తిమూర్తిగా నిలిచాడు. నిన్న మొన్నటి కార్గిల్ యుధ్ధంలో కూడా రామాయణంలోని ఈ ఘట్టమే మార్గదర్శనం చేసి భారతీయుల జీవనాదర్శాలు అంత మహోన్నతంగా ఉంటాయని యావత్ప్రపంచానికీ చాటి చెప్పింది.

కార్గిల్ యుధ్ధంలో మన సైనికులు పాకిస్థాన్ వారికి చిక్కితే క్రూరాతిక్రూరంగా చిత్రహింసలు పెట్టి, నీచాతి నీచంగా కళ్ళు, చెవులు, మోకాళ్ళు చెక్కేసి శవాలను మన సరిహద్దు వైపు త్రోసేసారు. అదేసమయంలో వారి సైనికులు కొందరు మనవారి చేతుల్లో మరణించారు. ఆ శవాలను పెట్టెలో పెట్టి వారికి అప్పగిస్తే ఆశ్చర్యకరంగా తీసుకొందుకు నిరాకరించారు. చనిపోయిన సైనికుల గురించి ఆ దేశ నాయకులకు చింత ఉండదన్నమాట. అప్పటి ప్రధాని వాజ్పాయ్ ని ఏం చెయ్యాలని మన సైన్యాధిపతులు సంప్రదించారు. భారతీయ సంస్కారం మూర్తీభవించిన అటల్ బిహారి వెంటనే రామయణంలో యుధ్ధకాండలోని 'మరణాంతాని వైరాని' అనే (పైనుదహరించిన) శ్లోకాన్ని చదివి ఇలా అన్నారుట. ఏ దేశం తరపున పోరాడినా సైనికుడు సైనికుడే. రాజకీయ నాయకత్వంలో అహంకారాలవల్ల యుధ్ధాలు జరుగుతుంటాయి. దానికి సైనికులను నిందించకూడదు. వీరుడి భౌతిక దేహాన్ని కూడా వీరొచితంగానే గౌరవించాలి. వారి శవాలకి ఇస్లాం మత సాంప్రదాయం ప్రకారం వారి మౌల్వీల సమక్షంలో ఖనన సంస్కారాలు జరిపించండి. అని ఆదేశించారట. అప్పట్లో వార్తాపత్రికలు ఈ విషయాన్ని ప్రచురిస్తే ప్రతి భారతీయుని కళ్లు చెమర్చి భక్తిగా రామునికి, వాజ్పాయ్ కి నమస్కరించాయి. ఇదీ రామాయణ

No comments:

Post a Comment