Wednesday 4 May 2016

మరల నిదేల రామాయణం బన్నచో - కవిసామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ (క్రీ.శ.1895 – 1976)
ఇంతకుముందే ఎందరోమహాకవులచే విరచింప బడిన రామాయణాన్ని మరల తమరెందుకు రాస్తున్నారని అడిగిన వారికి శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఇచ్చిన సమాధానం ఇది.
మరల నిదేల రామాయణం బన్నచో
నీ ప్రపంచక మెల్ల వేళలయందు
తినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు
తన రుచి బ్రతుకులు తనవి గాన
చేసిన సంసారమే చేయుచున్నది
తనదైన యనుభూతి తనది కాన
తలచిన రామునే తలచెద నేనును
నా భక్తి రచనలు నావి గాన
కవి ప్రతిభలోన నుండును కావ్యగత శ
తాంశములయందు తొంబదియైన పాళ్ళు
ప్రాగ్వి పశ్చిన్మతంబున రసము వేయి
రెట్లు గొప్పది నవకథా ధృతిని మించి.

మరల రామయణమిదేల అన్నచో ఈ ప్రపంచములో అందరూ ఎల్లవేళలా తినుచున్న అన్నమే రోజూ తింటున్నారు విసుగులేకుండా ఎవరి రుచులు వారివి కనుక, చేసిన సంసారమే చేయుచున్నారు ఎవరి అనుభూతులు వారివి కనుక, అలాగే తలచిన రాముడినే మరల నేను తలచెదను. నా భక్తి రచనలు నావి కనుక. రామాయణ కథ ఎవరైనా చెప్పవచ్చు. కానీ ప్రతిభానుసారియైన రసపోషణలో వైలక్షణం ఉంటుంది.
సంకలనం: శ్రీ బాలాంత్రపు వెంకట రమణ.: తెలుగు పద్య మధురిమలు.

No comments:

Post a Comment