Monday 24 February 2014

ఆదూరి వేంకట సీతారామమూర్తి కధలు

ఆదూరి వేంకట సీతారామమూర్తి గారు  ప్రఖ్యాత రచయిత. వారి  కధల  గురించి నేనేమీ ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. సాహిత్యాభిమానులందరికీ చిరపరిచితమైన వ్యక్తి.  ఈమధ్య తన కధలను సి.డీ. లలో పొందుపరిచారు. అతను తన గళం లోనే కధ చెప్పినట్లు కధంతా సి.డీ.లోకి చేర్చారు. ఒక్కోసారి పుస్తకం పట్టుకొని చదువుకోవడానికి సదుపాయంగా ఉండదు. అటువంటప్పుడు ఈ సీడీని ని పెట్టుకుని హాయిగా పడుకొని కధలను వినవచ్చు. చిన్నప్పుడు అమ్మమ్మో, బామ్మో కధ చెప్తూంటే హాయిగా వినేవాళ్ళం. ఆ అనుభూతిని మళ్ళీ పొందవచ్చు. కధ వింటూ నిద్రలోకి జారుకోవచ్చు. లేదా కారులో ఎక్కడికైనా దూరప్రయాణం చేస్తున్నప్పుడు ఈ కధలు వింటూ ప్రయాణ బడలిక మర్చి పొవచ్చు.


ఈ. సి.డీ.లో ఉన్న కధలన్నీ ఆణిముత్యాలే. అందులో ముఖ్యంగా  ‘ఆత్మధృతి’, ‘వాడి మధ్యాహ్నభోజనం’, ‘ఓ మహిషాత్మ కధ’, ‘పూలమనసు’ లాంటి కధలు మనసు తలుపు తట్టి కళ్ళు చెమర్చేలా చేస్తాయి.  ‘పాత బంగారం’, ‘అనంతలక్ష్మి అమెరికా ప్రయాణం’ వంటి కధలు సునిశితమైన హాస్యంతో మనసుని ఉత్తేజ పరుస్తాయి.  అన్ని కధలూ చాల బాగున్నాయి. మీరూ  విని ఆనందించండి.

No comments:

Post a Comment