Wednesday 23 April 2014

రాధామాధవుల ప్రణయం.


చేతికి గాజులులా, కళ్ళకు కాటుకలా 
  నుదిటికి తిలకంలా రాధకు మాధవుదు
                                                            అన్నాడొక సినీకవి.

రాధామాధవుల ప్రేమతత్వం అజరామరమైనది, అనిర్వచనీయమైనది. వారి అనురాగం, నిండైన వారి ప్రేమ లోకానికి ఆదర్శం. తొలి వాగ్గేయకారుడైన శ్రీ జయదేవుడు పన్నెండవ శతాబ్దము వాడు. ఉత్కళ దేశస్థుడు. సంస్కృతంలో లో రచించన ఈతని రచనలన్నీ రాధామాధవుల ప్రణయంతో నిండివున్నవే. గీత గోవిందం పేరిట ప్రసిద్ధి గాంచిన అష్టపదులు. జయదేవుని అష్టపదులు నాటికీ నేటికీ కవులకూ, గాయకులకూ మార్గదర్శకం. అష్టపది లేని ఏ సంగీత కచేరి ఉండదు. తరువాత పద్నాల్గవ శతాబ్దం వాడైన అన్నమయ్య కూడా రాధా మాధవుల ప్రణయముపై చాలా అందమైన కీర్తనలను రచించాడు. ఆ తరువాత మహాకవి క్షేత్రయ్య అచ్చ తెలుగు భాషలో రచించిన మువ్వ గోపాలుని పదాలన్నీ రాధామాధవ ప్రణయం తోనే నిండి ఉంటాయి.

నిజానికి రాధామాధవుల ప్రణయం అంతర్లీనంగా ఆత్మ పరమాత్మల సంగమం. అదో అద్భుతమైన ప్రేమ తత్వం.

No comments:

Post a Comment