Tuesday 29 December 2015

పురందర దాసు


హంపీ పర్యటనలో శ్రీ పురందరదాసుగారి భజన మంటపము దర్సించాము. విశాలమైన మంటపము తుంగభద్రా నదీ తీరములో ఉంది. అక్కడ కూర్చుని పురందరదాసుగారు విఠలుని మీద కీర్తనలు రచించి పాడుకొనే వారుట. అక్కడ వారి చిత్రము రాతిమీద చెక్కబడి ఉంది. అది చూస్తే చాలా సంతోషం కలిగింది. ఆ మహావాగ్గేయకారుని గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు పొందుపరిచాను.
శ్రీ పురందర విఠల దాసు (కర్నాటక సంగీత పితామహ).
వీరు పదహారవ శతాబ్ధమువారు. పాండురంగ విఠలుని భక్తులు. సంగీత సాహిత్యములలో ప్రావీణ్యము గలవారై ఒక్కొక్క సమయమునందు వీరు రచించిన కీర్తనలచే శ్రీ పాండురంగ విఠలుని కటాక్షమును పొందిన వారై ఉండిరి. సంగీతములో మాయామాళవగౌళ రాగములో ప్రారంభకులకు అనువుగా ఒక క్రమములో స్వరావళి, జంటస్వరములు, అలంకారములు, గీతములు, సూళాదులు, ప్రబంధములు రచించిరి. కర్నాటక సంగీతమును క్రమబద్ధీకరణ చేసి, సంగీత విద్యార్ధులకు అందజేసినందువలన వీరికి కర్నాటక సంగీత పితామహుడు అన్న బిరుదు లభించినది. వేదోపనిషత్తులు జనులకు బోధించిరి. వీరి కీర్తనలు ఎక్కువగా వేదాంతపరముగా నుండును.
- పొన్నాడ లక్ష్మి

No comments:

Post a Comment