Wednesday 16 December 2015

అమృతవాహిని






ఈ నెల 15వ తేదీనాడు హైదరాబాద్ లో నేషనల్ బుక్ ట్రస్ట్ ఆవరణలో ప్రముఖ రచయిత్రి  శ్రీమతి గంటి సుజల గారు రచించి, ఆంధ్రభూమి నవలల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన నవల 'అమృతవాహిని', కధల సంపుటి 'ప్రియే చారుశీలే'  పుస్తకాలు ఆవిష్కరించ బడ్డాయి. 'అమృతవాహిని' నవలకి ముఖచిత్రంగా చిత్రకారులయిన మా శ్రీవారు (పొన్నాడ మూర్తి) గారి కుంచెలో చిత్రీకరించబడిన చిత్రం ముఖచిత్రంగా రూపుదిద్దుకుంది. ఆశించినదానికంటే మిన్నగా నవలలో పాత్రకి తగ్గట్టుగా వచ్చి, పలువురు ప్రశంసలు పొందింది.
పుస్తకానికి ముఖచిత్రం వెయ్యడం ఇది వారి తొలి ప్రయత్నం. సభకు  విచ్చేసినవారందరూ  ప్రశంసిస్తుంటే నాకెంతో ఆనందం కలిగింది. ఇలా చిత్రలేఖనంలో ఒక్కొక్క మెట్టు పైకెక్కి ముందుముందు అఖండ విజయం సాధించాలని భగవంతుని కోరుకుంటున్నాను.

-- పొన్నాడ లక్ష్మి

No comments:

Post a Comment