Saturday 4 June 2016

దైవమోక్కడే సంతత భజనీయుడు - అన్నమయ్య కీర్తన.


Ponnada Lakshmi
Write a comment...
ప. దైవమోక్కడే సంతత భజనీయుడు
భావము సమబుద్ధి బాయగ దగదు
౧. హరియే సకలాంత రాత్మకుం డటుగాన
తిరమై యోకరి నిందింప దగదు,
అరయగ లోకము లనిత్య మటుగాన
మరగి కొందరిమీది మమతయు వలదు.

౨. బహు కల్పితములెల్ల బ్రకృతి మూలమె కాన
గహనపు దన ఉద్యోగమూ వలదు.
సహజ విహారుడు సర్వేశ్వరుడు గాన
వహి దానె వచ్చినవి వలదన దగదు
౩. తపములు జపములు దాస్యమూలమె కాన
ఉపమల సందేహ మొగి వలదు
ఎపుడును శ్రీ వేంకటేశ్వరు సేవించి
చపలచిత్తము వారి సంగ మిక వలదు.
భావము: ఎల్లవేళల జీవులు కారాధింపదగినవాడు భగవంతుడొక్కడే. పరమాత్ముడు సర్వత్ర సమముగా వ్యాపించి యున్నాడు గాన భగవంతుని పూజించిన వారెన్నడును సమద్రుష్టిని వీడరాదు.
సమస్తజీవులను అంతరాత్ముడైనవాడు శ్రీహరియే. కావున ఒకరిపై ద్వేషము బూని నిందించుట ఎంతమాత్రము తగదు. ఈ లోకములన్నియు అశాశ్వతము లైనవే. ఎవ్వరును మానల నంటి పెట్టుకుని కలకాలము ఉండబోరు. కావున కొందరిపై మమకారము కూడ ఉచితము కాదు.
ఈ ప్రకృతి నుండియే చిత్రవిచిత్రములైన అనేక కల్పనలు ఏర్పడుచున్నవి, కాని కష్టపడి జీవులు తమకు తాముగా ప్రయత్నించి సాధించునదేమియు లేదు. అందుచే అట్టి ప్రయత్నం చేయవలదు. అంతటికి మూలమైన పరమాత్ముడు సహజ విహారుడు కావున ఆ దేవుని సంకల్పముచే తమకు తాముగా వచ్చినవాటిని వలదనుట తగదు.
మోక్షప్రాప్తికై చేయు తపములు, జపములు మున్నగున వన్నియు భగవంతుని దాస్యమూలములే కాని అన్యములు కావు. కావున ఆయా సాధనలకు భగవంతుడిచ్చిన వానిపట్ల సంశయము కలిగి యుండరాదు. సర్వదా శ్రీ వేంకటేశ్వరునే సేవించు వారికి చపలచిత్తులై దైవమును భజించని మూర్ఖులతో నెట్టి సంబంధము పనికిరాద

No comments:

Post a Comment